అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిలా నిలిచి పోయిన చిత్రం అంటే అది పుష్ప అనే చెప్పాలి.అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.
ఈ సినిమాలో నటించిన వారు కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకుని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.హిందీలో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సన్నాహాల్లోనే అందరు బిజీగా ఉన్నారు.
పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
కాగా పుష్ప 2 సినిమా ఇంకా రెగ్యురల్ షూట్ కే వెళ్ళక ముందే ఈ సినిమా పై అప్డేట్ లు బయటకు వస్తూనే ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమాలో సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటిస్తుంది అని టాక్ వచ్చింది.
ఇంకా సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా పుష్ప 2 లో భాగం కానుందట.ఇక ఇప్పుడు మరొక స్టార్ కూడా భాగం కానున్నాడు అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా నటించ నున్నారని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.ఇప్పటికే సుకుమార్ చర్చలు జరిపినట్టు టాక్.ఈ సినిమాలో మరో పోలీస్ క్యారెక్టర్ ఉందట.ఆ క్యారెక్టర్ లోనే అర్జున్ కపూర్ నటించ బోతున్నట్టు తెలుస్తుంది.మరి వీటిలో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాల్లో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.