సాధారణంగా సినీ పరిశ్రమలోకి హీరోలు తమ కూతుళ్లను తీసుకురావాలంటే ఒకింతగా ఆలోచిస్తారు.అదే హీరోలు తమ వారసులను పరిచయం చేయడానికి అయితే మాత్రం అసలు వెనకాడరు.
అయితే కొందరు హీరోలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ తమ తమ వారసురాళ్లను గ్రాండ్ గా సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే తాజాగా విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ అర్జున్ తన పెద్ద కూతురు అయినటువంటి ఐశ్వర్య అర్జున్ ని తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని చూస్తున్నాడు.
అంతేగాక ఎందుకు సంబంధించినటువంటి వాళ్ల సన్నాహాలను కూడా ఇప్పటికే మొదలుపెట్టాడు.ఇందులో భాగంగా తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఓ ప్రముఖ దర్శకుడిని సంప్రదించినట్లు సమాచారం.అన్ని కుదిరితే ఈ ఏడాదిలో ఐశ్వర్య అర్జున్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం.
అయితే ఐశ్వర్య అర్జున్ ఇప్పటికే కోలీవుడ్లో ప్రముఖ నటుడు విశాల్ నటించిన టువంటి పట్టాత్తు యానై అనే చిత్రంలో కథా నాయికగా నటించి మెప్పించింది.అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఐశ్వర్య అర్జున్ కి పెద్దగా అవకాశాలు రాలేదు.