ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నాయి.వీక్షకులలో చాలామంది ఆ వార్తలనే నిజమని నమ్ముతున్నారు.
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో జానకి కలగనలేదు అనే సీరియల్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ సీరియల్ లో అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తున్నారు.
అయితే ఈ హీరో చనిపోయాడని ఫేక్ వార్తలు ప్రచారంలో వచ్చాయి.
బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అరియానా గ్లోరీ కూడా ఒకరు.
యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అరియానా గ్లోరీ బిగ్ బాస్ బజ్ కు యాంకర్ గా వ్యవహరించడంతో పాటు కంటెస్టెంట్లకు సంబంధించిన సీక్రెట్లను ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు.బిగ్ బాస్ షో ద్వారా అరియానా జాతకమే మారిపోయిందని చెప్పాలి.
సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు కూడా వస్తుండటంతో అరియానా గ్లోరీ ఆచితూచి ఆ ఆఫర్లను ఎంపిక చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అరియానా గ్లోరీ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.జానకి కలగనలేదు సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి అరియానా గ్లోరీ స్నేహితుడు కాగా స్నేహితుని గురించి తప్పుగా ప్రచారం జరుగుతుండటంతో అరియనా గ్లోరీ ఘాటుగా స్పందించి కామెంట్లు చేశారు.
పదిమందికి తెలిసిన వాళ్ల గురించి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు రకరకాలుగా వీడియోలు పెడతాయని అయితే కొన్ని ఛానెళ్లు బ్రతికి ఉన్న మనిషి చనిపోయాడని ప్రచారం చేస్తున్నాయని ఇలా థంబ్ నెయిల్స్ పెట్టేవాళ్లకు కామన్ సెన్స్ ఉందా? అని అరియానా కామెంట్లు చేశారు.నా స్నేహితుడు అమర్ దీప్ చౌదరి గురించి తప్పుగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అరియానా తెలిపారు.ఆ ఛానెల్ చెత్త ఛానెల్ అని అరియానా పేర్కొన్నారు.