ప్రభుత్వాన్ని పాలిస్తున్న వారు.ఏ నిర్ణయం అయిన ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నాయకులు తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.కక్ష పూరిత్తంగా ఎదుటివారిపై అధికారాన్ని ఉపయోగించాలని బావిస్తే పదవి చేజారే ప్రమాదం ఉంది.
ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ అనుసరిస్తున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం అనుసురిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు కక్ష పూరితంగా మారాయి.గతంలో అదికారంలో ఉన్న చంద్రబాబు కూడా జగన్ విషయంలో అనుసరించిన తీరే తరువాత ఎన్నికల్లో బాబుకు అధికారాన్ని దూరం చేసింది.
గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు జగన్ పర్యటనలు అడ్డుకుని, ఆయనను అరెస్టు చేయించినా సందర్భాలు ఉన్నాయి.అరెస్ట్ అయిన నాయకులు ప్రజల గుండెలలో హీరోలుగా నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు చెప్పినట్టు… 2019లో జగన్ను ముఖ్యమంత్రి సీట్కు దగ్గర చేసింది.
అదే ఇప్పుడు లోకేష్ విషయంలో అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది.ఇటివల నర్సారావు పేట పర్యటనకు వెళ్లకుండా ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.అయితే నాడు చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు సీఎం జగన్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది.151 సీట్లు లో విజయం సాధించిన జగన్.లోకేశ్ పర్యటనను అడ్డుకోవడం వలన వైసీపీకి ఎందుకు భయమేస్తుందో అర్థం కావడం లేదు.
ఏ రాజకీయ నాయకుడు అయిన తాను ఏప్పుడు ప్రజలు తమ గురించే ఆలోచించాలని ఆరాటపడుతుంటారు.
ఇప్పుడు లోకేష్ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరు అలాగే ఉంది.అరెస్టులతో లోకేష్ను పాపులర్ చేస్తోంది.
గతంలో యువ నాయకుడిగా ఎదుగుతున్న సీఎం జగన్ను కళ్లేం చేయాలని చంద్రబాబు చేస్తే.ఇప్పుడు లోకేశ్ విషయంలో జగన్ ఇలానే వ్యవహరిస్తున్నారు.
ఇలా ఆంధ్రపదేశ్లో రాజకీయాలు కక్ష పూరితంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.