రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం.అయితే విమర్శల విషయంలో ఏ మాత్రం తొందరపాటుగా వ్యవహరించినా రాజకీయంగా ఎదురుదెబ్బలు ఎదుర్కోక తప్పదు అనే దానికి రాజకీయాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి.
అయితే తాజాగా బండి సంజయ్ ఘటననే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరి పండించండి ఎలా కొనరో చూస్తా అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద రాజకీయ దుమారాన్ని రేపాయో మనం చూశాం.
ఏకంగా బీజేపీని రైతులు పెద్ద ఎత్తున తరిమి కొట్టే పరిస్థితి వరకు తీసుకొచ్చింది.వెంటనే కేంద్ర ప్రభుత్వం మేము యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనేది లేదని స్పష్టం చేయడంతో ఇక బండి సంజయ్ మౌనం వహించక తప్పలేదు అంతేకాక ఇంకా ఈ విషయాన్ని తమ ప్రచార ఆయుధంగా కూడా భవిష్యత్తులో కెసీఆర్ వాడుకునే అవకాశం వందకు వంద శాతం ఉంది.
ప్రస్తుతం తీన్మార్ మల్లన్న కూడా కేసీఆర్ పై పెద్ద ఎత్తున విరుచుక పడుతూ మాటల తూటాలు వదులుతున్న పరిస్థితి ఉంది.ఏదో ఒక చోట విమర్శల విషయంలో హద్దు దాటితే ఇక కేసీఆర్ చేతిలో బలికాక తప్పదు.అయితే విమర్శలతోనే సోషల్ మీడియాలో ఏరోజుకారోజు హాట్ హాట్ రాజకీయం చేయాలనుకుంటే బీజేపీ చేసే అతి పెద్ద తప్పుల్లో ఇది ఒకటి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న మాటల దాడి అనేది రానున్న రోజుల్లో కేసీఆర్ కు చక్కటి అవకాశంగా మారే అవకాశం ఉంది.
మరి ఇదే తరహా విధానాన్ని కొనసాగిస్తారా లేక మరేదైనా వ్యూహంతో ముందుకెళ్తారా అన్నది చూడాల్సి ఉంది.