ఇప్పుడున్న స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్టు ఫోన్లు ఉండటంతో అందరూ కూడా ఇన్ స్టా గ్రామ్ లేదంటే ఫేస్ బుక్ లేదంటే వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు.
ఇక ఇటీవల ఫేస్ బుక్ కంపెనీకి చెందినటువంటి ఇన్ స్టాగ్రామ్ విపరీతంగా ఫేమస్ అయిపోయింది.ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్కు కోట్లాది మంది యూజర్లు ఉన్నారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది.
ఫేస్ బుక్ కన్నా కూడా ఎక్కువ మంది ఇన్ స్టా గ్రామ్లోనే ఫొటోలు పెడుతుంటారు చాలామంది.
మరీ ముఖ్యంగా యూత్ ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ ను వాడుతుంటారు.
ఇలాంటి తరుణంలో ఇప్ప్ఉనడు ఓ వార్త అందరినీ షాక్కు గురి చేస్తోంది.అదేంటంటే ఇన్ స్టాగ్రామ్ వాడకం కొందరు టీనేజర్లకు ప్రమాదకరంగా మారిందని, చిరకు వారి ప్రాణాలను తీసే స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉంటుందని చెబుతున్నారు.
అయితే ఈ విషయాన్ని కూడా ఫస్త్రస్ బుక్ స్వయంగా రెడీ చేసిన రిపోర్టులో వెల్లడించింది.యూత్ జీవితాలపై ఇన్ స్టాగ్రామ్ ఎక్కువగా ప్రభావాన్ని చూపుతోందట.
దాదాపు మూడేళ్లుగా స్టడీ చేసిన డేటాను ఫేస్ బుక్ ఆ రిపోర్టులో వెల్లడించింది.
ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్గా ఉంటున్న వారందరూ కూడా చాలా వరకు టీనేజర్లేనట.అయితే వీరు అందులో వచ్చే కొన్ని పేజీలను బాగా పాలో అవుతూ వాటి ఫీచర్ల కారణంగా అత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంటున్నారంట.మరీ ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లోని ఎక్స్ ప్లోర్ పేజ్ అనేది టీనేజర్ల పాలిట శాపంగా మారిందని, కొన్ని అకౌంట్లను రీసెర్చ్ చేసి ఇందులోని కొన్ని పోస్టుల్లో వేరే ఫీచర్లను చూపిస్తోందని, వాటిని టీనేజర్లు పాలో అయ్యి అలాగే కనిపించాలనే తపనతో ప్రయోగాలు చేస్తూ చివరకు ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పింది.
కాగా దీనికి త్వలరోనే పరిష్కార మార్గం కనుగొంటామని చెబుతున్నారు ఫేస్బుక్ అధికారులు.