హుజూరాబాద్లో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచే విధంగా ఉంటున్నాయి.ఎందుకంటే గతంలో కలిసి మెలిసి రాజకీయాలు చేసిన వారే ఇప్పుడు తమ చరిత్రను తామే బయట పెట్టుకుంటున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి హరీశ్రావు అన్నట్టు ఇక్కడ పోరు జరుగుతోంది.పార్టీలు పక్కకు వెళ్లి పరస్పర వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే దాకా వీరి ప్రచార పర్వం వచ్చింది.
నువ్వు అలా చేశావ్ అంటే నువ్వు ఇలా చేశావ్ అంటూ ఒకరి చరిత్ర ఒకరు బయట పెట్టుకుంటున్నారు.
అయితే ఇక్కడే మంత్రి హరీశ్రావు చేస్తున్న వ్యాఖ్యలు కొన్ని టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే విధంగా ఉంటున్నాయి.
అవేంటంటే మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా కట్టలేదని అది అడిగితే తనను తిడుతున్నారంటూ చెబుతున్నారు.తాను ప్రశ్నలు సంధిస్తుంటే ఈటల రాజేందర్ ఎందుకు తనను నోటికి వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక మంత్రి హరీశ్రావు మరో ఆరోపణలు చేశారు.ఈటల రాజేందర్ మంత్రి గా ఉండి కూడా హుజూరాబాద్ను డెవలప్ చేయలేదని చెప్తున్నారు.
ఇక్కడే ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.అంటే టీఆర్ ఎస్లో మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేని దుస్థితి ఉందంటే ఇప్పుడు మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పని తీరు ఇంకెలా ఉందో అని ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ అది కూడా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న వాటిల్లో ఇలాగే అధ్వాన్న పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు కూడా బాగానే చెబుతున్నాయి.మొత్తానికి హరీశ్రావు చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ ఎస్ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు.