దేశం మొత్తం ఓవైపు బాహుబలి మేనియాలో, మరోవైపు ఐపియల్ మత్తులో మునిగితేలుతోంది.గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఐపియల్ వీక్షకుల సంఖ్య మరింత పెరిగినట్టు చెబుతున్నారు టీఆర్పి రిపోర్టర్స్.
మరోవైపు ఎప్పుడూ ఏదో ఒక కంట్రావర్సికి జన్మనిచ్చే ఐపియల్ ఈసారి కూడా వివాదాన్ని తీసుకొచ్చింది.మీకు తెలిసే ఉంటుంది, యాంకర్ అర్చన విజయ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లికి సంబంధించిన ఓ ఫోటో ఇంటర్నెట్ లో ఎంత వైరల్ గా వెళ్ళిందో.
ఈ ఫోటోలో కొహ్లీ అర్చన వైపు తలకిందికేసి చూస్తూ ఉంటాడు.ఈ ఫోటో చూసిన వారంతా అర్చన టోర్న్ జీన్స్ వైపే కొహ్లీ చూస్తున్నాడని, క్రికేటర్ అయినా, మగవారు మగవారే అంటూ పోస్టులు పెట్టారు.
అనుష్క ఈ ఫోటో చూస్తే కొహ్లీకి బ్రేకప్ చెప్పేస్తుందని అంచనా వేసారు.ఇదంతా జరిగి ఓ రెండువారాలు అవుతోంది.
ఇన్నిరోజుల తరువాత ఆ ఫోటో మీద స్పందించి, అసలు విషయాన్ని బయటపెట్టింది అర్చన.“పాపం కొహ్లీ.ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ రౌండ్ మొదలుపెట్టబోతుండగా నా చేతిలో పేపర్ చూస్తున్నాడు కొహ్లీ.ప్రశ్నలు ముందే చూసుకోని జవాబులు తెలివిగా ఇద్దాం అనుకున్నాడు.
కాని దాన్ని మరోలా అర్థం చేసుకున్నారు జనాలు.తను టోర్న్ జీన్స్ లో నా శరీర భాగాల్ని చూస్తున్నాడు అనుకున్నారు.
దానికి మీడియా ఓవర్ యాక్షన్ పెద్ద కారణం.అసలు హెడ్ లైన్స్ లోకి ఎక్కాల్సిన వార్తేనా ఇది? దీన్ని కూడా ఇంతపెద్ద వార్త చేయాలా?” అంటూ చిర్రుబుర్రులాడింది అర్చన.
మిగితా ఐపియల్ వార్తల్లోకి వెళితే, కొహ్లీ నాయకత్వం వహించే బెంగళూరు మొదటి రౌండ్ లోనే ఇంటిముఖం పట్టనుంది.ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ముంబాయి, కోల్ కతా, ఛాంపియన్స్ హైదరాబాద్ మరియు పుణే ప్లే ఆఫ్స్ దశలోకి క్వాలిఫై అయ్యేలా ఉన్నాయి.