ఒకప్పటి హీరోను తుక్కుకింద కొడతానంటోన్న మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

 Aravind Swamy As Villain In Sarkaru Vaari Paata, Aravind Swamy, Sarkaru Vaari Pa-TeluguStop.com

కాగా ఈ సినిమాను ఆర్ధిక నేరాల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నట్లు చిత్ర ప్రీలుక్ పోస్టర్‌తో మనకు చూపించారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమా కథ పాన్ ఇండియా చిత్రానికి పర్ఫెక్ట్‌గా ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో మహేష్‌ను ఢీకొట్టేందుకు ఒక అల్ట్రా స్టైలిష్ విలన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే ఈ సినిమాలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్రను విలన్‌గా నటింపజేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆయన విలన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదట.దీంతో మరో తమిళ నటుడు అరవింద్ స్వామిని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

గతంలో ధృవ చిత్రంలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన అరవింద్ స్వామి, ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి పోరాడేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో మహేష్ సరికొత్త హెయిర్ స్టయిల్‌లో మనకు కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో అరవింద్ స్వామి నిజంగానే విలన్ పాత్రలో నటిస్తున్నాడా లేడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube