టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను ఆర్ధిక నేరాల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నట్లు చిత్ర ప్రీలుక్ పోస్టర్తో మనకు చూపించారు చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమా కథ పాన్ ఇండియా చిత్రానికి పర్ఫెక్ట్గా ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ఈ సినిమాలో మహేష్ను ఢీకొట్టేందుకు ఒక అల్ట్రా స్టైలిష్ విలన్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఈ సినిమాలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్రను విలన్గా నటింపజేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ఆయన విలన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదట.దీంతో మరో తమిళ నటుడు అరవింద్ స్వామిని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
గతంలో ధృవ చిత్రంలో విలన్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన అరవింద్ స్వామి, ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి పోరాడేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో మహేష్ సరికొత్త హెయిర్ స్టయిల్లో మనకు కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమాలో అరవింద్ స్వామి నిజంగానే విలన్ పాత్రలో నటిస్తున్నాడా లేడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.