సంక్రాంతి సీజన్ ప్రారంభం అయ్యింది.సినిమాల సంక్రాంతి సీజన్ నేడు దర్బార్ విడుదల అవ్వడంతో చాలా గ్రాండ్గా ప్రారంభం అయ్యిందని చెప్పుకోవచ్చు.
దర్బార్ సినిమా నేడు విడుదల అయినా కూడా అందరి దృష్టి మాత్రం సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో సినిమాలపైనే ఉంది.ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ తెలుగు ప్రేక్షకులు అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత ఆరు నెలలుగా ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రబ్లిసిటీ చేస్తున్నాయి.
విడుదలకు సిద్దం అయిన ఈ సమయంలో ఏ సినిమా బలం ఎంత అనే విషయాలపై చర్చ జరుగుతోంది.
ఇలాంటి సమయంలో పాటల విషయంలో అల వైకుంఠపురంలో సినిమాతో పోల్చితే సరిలేరు నీకెవ్వరు చిత్రం వెనుక పడిందని చెప్పుకోక తప్పదు.ఈ విషయాన్ని మహేష్బాబు ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటున్నారు.
కాని కంటెంట్ పరంగా మాత్రం మహేష్ బాబు సినిమా చాలా చాలా ముందు ఉంటుందని వారు అంటున్నారు.
అల వైకుంఠపురంలో సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు.రికార్డు స్థాయిలో ఆ పాటలు వ్యూస్ను దక్కించుకుంటున్నాయి.ఇప్పటికే జనాల్లో అల వైకుంఠపురంలో సినిమా పాటలు తెగ వినిపిస్తున్నాయి.
కాని సరిలేరు నీకెవ్వరు చిత్రం పాటలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదు.థమన్ మరియు దేవిశ్రీ ప్రసాద్లు పోటీ పడగా ఇప్పుడు మాత్రం థమన్ ముందు నిలిచాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పాటల విషయంలో వైకుంఠపురం ముందు ఉంటే సినిమా విషయంలో ఏది ముందు ఉంటుందో చూడాలి.