కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.దేశంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతానికి చెందిన వారు విమానాశ్రయాలలో అదేవిధంగా రైల్వేస్టేషన్లో, బస్టాండ్లో ఖచ్చితంగా కరోన టెస్టులు చేయించుకున్న తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టే ఈ విధంగా ఏర్పాటు చేశారు.
దీంతో ఎక్కడికక్కడ రాండమ్ టెస్టులు చేయడానికి అధికారులు రెడీ అయ్యారు.
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే పరిస్థితి ఉండటంతో ప్రజలంతా కరోనా నిబంధనలు కఠినంగా పాటించాలని జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది.
ఇదే తరుణంలో ఢిల్లీలో త్వరలో జరగబోయే హోలీ, షాబ్ – ఈ- బారాత్, నవరాత్రి ఉత్సవాలను నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది.సినిమా హాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వంటి చోట్ల బహిరంగ ప్రదేశాలలో కచ్చితంగా కరోనా నిబంధనలు … మాస్కులు ధరించడం సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలని స్పష్టం చేశారు.
ఇటీవల ఢిల్లీలో కూడా ఊహించని విధంగా కేసులు పెరుగుతూ ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
.