గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.హమాస్ ఉగ్రవాద సంస్థకి చెందిన వాళ్లు గాజా ప్రాంతం నుండి.
ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై భారీ స్థాయిలో రాకెట్లు వదులుతూ ఉన్నారు.ఈ క్రమంలో ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వస్తున్న రాకెట్లను గాలిలోనే నిర్వీర్యం చేస్తూ.
మరికొన్ని రాకెట్లను ఖాళీ ప్రదేశాలలో పడేస్తూ ఉంది.
ఇదే క్రమంలో ఇజ్రాయిల్ దేశానికి చెందిన వైమానిక దళాలు గాజా ప్రాంతంలో దాగి ఉన్న ఉగ్రవాదులపై యుద్ధ విమానాలతో విరుచుకుపడుతూ .అనేక మంది ఉగ్రవాదులను ఏకిపారేస్తున్న సంగతి తెలిసిందే.పరిస్థితి ఇలా ఉండగా పాలిస్తున్న దేశానికి మద్దతుగా అరబ్బు దేశాలు రంగంలోకి దిగుతున్నాయి.
ఈ క్రమంలో పాలస్తీనాకు పాకిస్తాన్, టర్కీ, లెబనాన్ దేశాలు. మద్దతు తెలిపాయి.
మొత్తం మీద పరిస్థితి చూస్తే ఇజ్రాయేల్ దేశం ఏకాకి అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా పరిణామాలను బట్టి అంతర్జాతీయ మీడియా తెలియజేస్తూ ఉంది.
.