ఇండియన్ దిగ్గజ సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ఏ.ఆర్.
రెహమాన్.హాలీవుడ్ సినిమాలకి సైతం రెహమాన్ సంగీతం అందిస్తూ ఉన్నాడంటే అతని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న ఒకే ఒక్క సంగీత దిగ్గజం కూడా.
మణిరత్నం పాన్ ఇండియా మూవీకి ప్రస్తుతం రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే సంగీత దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున రెహమాన్ ఇప్పుడు రచయితగా కొత్త అవతారం ఎత్తాడు.
99 సాంగ్స్ టైటిల్ తో కథని తయారు చేసి తానే నిర్మాతగా మారి సినిమాని తెరకెక్కించాడు.మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
సాంగ్స్ నేపధ్యంలోనే సినిమా కంటెంట్ ఎక్కువ ఉంటుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని తాజాగా రెహమాన్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.హిందీలోతెరకెక్కిన ఈ సినిమా అతనికి రచయితగా ఎంత వరకు మొదటి సక్సెస్ అందిస్తుంది అనేది చూడాలి.