రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ సంక్రాంతి కానుకగా రిలీజవుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
గజినీ, 7th సెన్స్, తుపాకి వంటి సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి తన సత్తా చాటుకున్న మురుగదాస్, దర్బార్ రిలీజ్ సందర్భంగా తెలుగు ఆడియెన్స్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మాట్లాడారు.
గతంలో తాను రెండు తెలుగు సినిమాలను డైరెక్ట్ చేశానని చెప్పుకొచ్చిన మురుగ, స్టాలిన్ యావరేజ్ హిట్ కాగా స్పైడర్ ఫ్లాప్గా నిలిచిందని చెప్పాడు.
మహేష్ బాబు లాంటి చరిష్మా ఉన్న స్టార్ను తమిళంలో ఇంట్రొడ్యూస్ చేయాలనే తపనతో స్పైడర్ సినిమా తీసానని చెప్పిన మురుగదాస్, తెలుగు ఆడియెన్స్ అభిరుచిని తెలుసుకోలేకపోయానని చెప్పాడు.కేవలం మహేష్ను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్న తన స్వార్ధం వల్ల తెలుగులో మహేష్ బాబుకు ఒక డిజాస్టర్ సినిమా నిలిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఎప్పటికైనా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తాను సినిమా చేస్తానని మాటిచ్చారు.ఏఆర్ మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇలాంటి కామెంట్ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే రజినీకాంత్ దర్బార్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.