ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఏడుకొండల వారి దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రతి రోజు 1000 శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి టికెట్ను పొందవచ్చు.అయితే వీరి వ్యూహం బాగా ఫలించిందట.
ఈ సదుపాయం పెట్టినప్పటి నుండి ఆర్టీసీ బస్సు టికెట్స్ లకు ఫుల్ డిమాండ్ పెరిగి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయట.దీంతో మరిన్ని టికెట్లను కేటాయించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారట.
ఇలా చేయడం ద్వారా పడిపోయిన ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోవాలని భావిస్తున్నారట.ఇక భక్తులకైతే పూర్తి సౌకర్యవంతంగా ఉందని, ఎటువంటి సిఫార్సులు లేకుండా సులువుగా, తక్కువ సమయంలో దైవ దర్శన భాగ్యాన్ని పొందే అవకాశం లభించిందని ఆనందపడుతున్నారట.ఇకపోతే గత నాలుగు రోజులుగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.