తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెబుతున్న ఏపీఎస్ ఆర్టీసీ.. !

తిరుపతికి వెళ్లగానే వీలైనంత త్వరగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మీ మనస్సు ఆరాట పడుతుందా.ఇంకా దర్శనానికి టికిట్స్ బుక్ చేయలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 Aps Rtc Telling Good News To Srivari Devotees Going To Tirupati, Aps Rtc, Good N-TeluguStop.com

ఎందుకంటే మీరు త్వరగా శ్రీవారి దర్శనం పొందాలంటే ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలు.

అవునండి తాజాగా ఏడుకొండల వారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ఏపీఎస్ ఆర్టీసీ శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచింది.

ఇందుకు భక్తులు చేయవలసిన పని ఏంటంటే ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణం చేస్తే చాలు.

ఇలాంటి వారి కోసం ప్రతి రోజూ బస్సుల్లో 1000 శీఘ్ర దర్శనం టికెట్లు అందుబాటులో ఉండనున్నాయట.ఇందుకు గాను తిరుపతి వెళ్లే ప్రయాణికులు బస్సు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చునట.ఈ విషయాన్ని ఏపీఎస్ ఆర్టీసీ వైఎస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇక భక్తుల కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు స్వామి వారి శీఘ్ర దర్శనం ఏర్పాట్లు చేశారట.

ఇందుకుగాను మీరు ప్రయాణించే బస్సు తిరుమల బస్‌స్టేషన్ చేరుకోగానే, ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌ స‌హ‌కారాలు అందిస్తారని, కాబట్టి ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు భక్తులను కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube