మన పెద్దలు నేరేడు పండ్లను ఒక్కసారైనా తినాలని చెప్పుతారు.కానీ నేరేడు పండ్లను దొరికినంత కాలం తింటే మంచిదని పరిశోధకులు అంటున్నారు.
నేరేడులో ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్యంలో సహాయపడతాయి.
గుండె జబ్బులు,మధుమేహం,క్యాన్సర్ ఆస్తమా,జీర్ణాశయ వ్యాధుల మీద పోరాడే శక్తి నేరేడుకు ఉంది.
ముఖ్యంగా మధుమేహ రోగులకు మంచి మందు అని చెప్పవచ్చు.ఎందుకంటే రక్తంలో చక్కర స్థాయిలను పెంచకుండా చేస్తుంది.అంతేకాక పిండిపదార్ధాలు చక్కరగా మారకుండా చేసే గుణం నేరేడులో ఉంది.
ఈ పండ్లను క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు తీసుకుంటే మధుమేహ రోగుల్లో దాహం తిరటమే కాకుండా ఇన్సులిన్ తీసుకొనే శాతం కూడా తగ్గుతుంది.
నేరేడులో ఉండే ఫైటో న్యూట్రియన్స్ కాలేయ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
నేరేడు పండులో ఐరన్ ,విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేయటంలో సహాయపడుతుంది.
అలాగే నేరేడులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.