కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది.ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.
అదేవిధంగా ఈ కమిటీకి అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది.రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన ఎన్డీఎస్ఏ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను కమిటీ సభ్యులు విశ్లేషించాలని కమిటీకి సూచించింది.అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలను కూడా తెలపాలన్న ఎన్డీఎస్ఏ నాలుగు నెలల్లో నివేదికను అందించాలని కమిటీకి తెలిపింది.