బీజేపీ మహారాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఓబీసీ నేత, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ భావన్ కుళే నియామకం అయ్యారు.ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది.
ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చంద్రకాంత్ పాటిల్ ఇటీవల లోక్ నాథ్ షిండే కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.దీంతో నూతన అధ్యక్షుని ఎంపిక అనివార్యమైంది.
అటు ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడిగా ఆశిష్ శేలార్ ఎంపికయ్యారు.ఇటీవల షిండే మంత్రివర్గంలో చేరిన మంగళ్ ప్రభాత్ లోధా స్థానంలో నియమితులయ్యారు.2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.