ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే నారా లోకేష్పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి.దీంతో విజయసాయిరెడ్డి చేసిన ట్విట్లు ఎప్పుడూ వైరల్గా మారుతూ ఉంటాయి.
ప్రతిరోజు ఆయన ఏదో ఒక ట్వీట్ చేస్తూనే ఉంటారు.ఇక విజయసాయిరెడ్డి ట్వీట్లకు ప్రతిపక్ష టీడీపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు.
ఇది ఇలా ఉంటే, తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీకి అనుకూలంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
బీజేపీతో గొడవపెట్టుకుని తప్పు చేశాననే విధంగా చంద్రబాబు గత కొద్దిరోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీతో టీడీపీ మరోసారి పొత్తు పెట్టుకోనుందనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.ఇలాంటి తరుణంలో ఏపీలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేసి నారా లోకేష్ని ఏపీ అధ్యక్షుడిగా నియమించుకునేలా చంద్రబాబు స్కెచ్ వేశాడని విజయసాయిరెడ్డి ట్విట్టర్లో ఆరోపించారు.మొదటి నుంచి బీజేపీ జెండా మోస్తున్న వారిని చంద్రబాబు అందుకే ఎదగకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.