ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ నటించిన “వకీల్ సాబ్” సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అనేక పార్టీల నేతలు ఖండిస్తున్నా సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ని సినిమా పరంగా అణిచి వేయడానికి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సినిమా ఇండస్ట్రీ లో హీరోల రెమ్యునరేషన్ పై కీలక కామెంట్ చేశారు.
సినిమా నిర్మించడానికి 100 కోట్లు అయితే, అందులో 80 కోట్లు ఈ హీరోల రెమ్యునరేషన్ ఉంటుందని కేవలం 20 కోట్లతో సినిమా నిర్మిస్తారని.
అన్నారు. ఆ 80 కోట్లు దోచుకోవడానికి అభిమానులు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ టికెట్ల రేట్లు పెన్చేస్తారని సంచలన కామెంట్ చేశారు.టికెట్ల రేట్లను పెంచేసి.600, 500 రూపాయలకు టిక్కెట్లను అమ్మటం ఏమిటి అని ప్రశ్నించారు.మీలాంటి వాళ్లకోసం టికెట్ల రేట్లను తగ్గించాలా అంటూ మండిపడ్డారు.నిజంగా అభిమానుల పై ప్రేమ ఉంటే మీ రెమ్యూనరేషన్ తగ్గించవచ్చు కదా అంటూ పేర్కొన్నారు.ఈ క్రమంలో కొంతమంది జగన్ రెడ్డి గారికి భయమేసింది అని వ్యాఖ్యలు చేస్తున్నారు.అసలు జగన్ ఎవరికి భయపడరు.
ఆ సాబ్ సున్న….ఈ రాష్ట్రంలో ఒకే సాబ్, అది సీఎం సాబ్, జగన్ సాబ్ అంటూ పరోక్షంగా వకీల్ సాబ్ సినిమా గురించి.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్లు వేశారు.