దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి కూడా అధికారం దక్కించుకునేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో వచ్చిన స్థాయిలో మోడీకి సీట్లు వస్తాయా రావా అనే విషయమై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఆయన్ను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందనే ప్రచారం జరిగింది.అయితే ఆమె వారణాసిలో పోటీకి ఆసక్తి చూపించలేదు.
ఇక తెలంగాణకు చెందిన పసుపు రైతులు వంద మంది అక్కడ నామినేషన్ వేయాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.చివరకు పాతిక మంది నామినేషన్ వేయగం ఒక్కరి నామినేషన్ మాత్రమే తీసుకోవడం జరిగింది.
మోడీకి పోటీగా నిలిచి తమ డిమాండ్ను వినిపించాలనుకున్న పసుపు రైతులకు నిరాశే మిగిలింది.ఇక మోడీకి పోటీగా విశాఖపట్నంకు చెందిన మానవ్ అనే యువకుడు బరిలోకి దిగాడు.
మానవ్ పెద్దగా హడావుడి లేకుండా మోడీపై పోటీకి నామినేషన్ వేయడం జరిగింది.
మానవ్ ఎవరు, అసలు అక్కడ ఎందుకు నామినేషన్ వేశాడు అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.మానవ్ పబ్లిసిటీ కోసం ఇలా మోడీపై నామినేషన్ వేశాడు అనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇండిపెండెంట్గా బరిలోకి దిగబోతున్న మానవ్ అక్కడ ప్రచారం కూడా చేయబోవడం లేదట.