ప్రధాని మోడీపై పోటీకి నామినేషన్‌ వేసిన తెలుగు యువకుడు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి కూడా అధికారం దక్కించుకునేందుకు శథవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో వచ్చిన స్థాయిలో మోడీకి సీట్లు వస్తాయా రావా అనే విషయమై చర్చ జరుగుతున్న ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఆయన్ను ఓడించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Ap Young Man Contests Against Narendra Modi-TeluguStop.com

కాంగ్రెస్‌ పార్టీ నుండి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతుందనే ప్రచారం జరిగింది.అయితే ఆమె వారణాసిలో పోటీకి ఆసక్తి చూపించలేదు.

ఇక తెలంగాణకు చెందిన పసుపు రైతులు వంద మంది అక్కడ నామినేషన్‌ వేయాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.చివరకు పాతిక మంది నామినేషన్‌ వేయగం ఒక్కరి నామినేషన్‌ మాత్రమే తీసుకోవడం జరిగింది.

మోడీకి పోటీగా నిలిచి తమ డిమాండ్‌ను వినిపించాలనుకున్న పసుపు రైతులకు నిరాశే మిగిలింది.ఇక మోడీకి పోటీగా విశాఖపట్నంకు చెందిన మానవ్‌ అనే యువకుడు బరిలోకి దిగాడు.

మానవ్‌ పెద్దగా హడావుడి లేకుండా మోడీపై పోటీకి నామినేషన్‌ వేయడం జరిగింది.

-Political

ap young man contests against Narendra Modi నరేంద్ర మోడీ

మానవ్‌ ఎవరు, అసలు అక్కడ ఎందుకు నామినేషన్‌ వేశాడు అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.మానవ్‌ పబ్లిసిటీ కోసం ఇలా మోడీపై నామినేషన్‌ వేశాడు అనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగబోతున్న మానవ్‌ అక్కడ ప్రచారం కూడా చేయబోవడం లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube