ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పొదుపు మంత్రం చదువుతున్నారు.అమరావతి శంకుస్థాపనకు 400 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పుడు గుర్తుకు రాని పొదుపు ఇప్పుడు గుర్తుకు వచ్చింది.
కారణం ? రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉండటమే.మొదటి మూడు నెలల్లోనే ఆరు వేల కోట్ల లోటు ఉందని చెప్పారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మీద ఆయన తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రం అసలే లోటులో ఉండగా పట్టిసీమ కోసం 9000 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు.
రైతులకు రుణ మాఫీ చేశామన్నారు.ఈ రెండు బడ్జెటులో లేవన్నారు.
రాష్ట్రం పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు బాగా తగ్గించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కోరారు.రవాణా శాఖ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల ఆదాయం బాగా పడిపోయిందని చెప్పారు.
రాష్ట్రం ఇంత ఆర్ధిక సంక్షోభంలో ఉండగా స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు తుళ్ళూరులో అసెంబ్లీ భవనం కట్టాలని ఎందుకు పట్టుబట్టారో అర్థం కాలేదు.