కరోనా మహమ్మారి తో దేశం నా నా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.మరోపక్క ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా దెబ్బతినడం తో లాక్ డౌన్ నిబంధనలను సడలించడం తో ఇటీవల కొన్ని వ్యాపారాలు కొనసాగుతున్నాయి.
అయితే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి అని,అలానే మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి అని చెబుతూ ప్రభుత్వాలు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో ఒక మహిళా ఉద్యోగిని పై డిప్యూటీ మేనేజర్ విచక్షణారహితంగా ప్రవర్తించారు.
కేవలం మాస్క్ పెట్టుకోవాలి అని సూచించిన పాపానికి ఉద్యోగిని పై ఆ డిప్యూటీ మేనేజర్ దాడికి దిగినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆమెను విచక్షణా రహితంగా ఇనుపరాడ్డు తో చితకబాదాడు.
నెల్లూరు జిల్లా లోని ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఠీ ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళితే… ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న ఉషా రాణి అనే మహిళ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ను మాస్కు ధరించాలని సూచించింది.
తనకే సూచనలు చేయడంతో కోపం పట్టలేకపోయిన అతడు ఉద్యోగినిపై దాడికి దిగాడు.వేగంగా వచ్చి కర్ర తీసుకువచ్చి దాడి చేశాడు.కిందపడేసి చితకబాదాడు.
మహిళ అని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ అడ్డుకోవడానికి వచ్చిన తోటి ఉద్యోగులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఈ ఘటనతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా,సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకొన్నా పోలీసులు విచారణ ప్రారంభించారు.