ఏపీలో మరో వివాదస్పద ఘటన చోటు చేసుకుంది.ఇప్పటికే టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో టీడీపీ నేతల అరెస్ట్లు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఈ క్రమంలో గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారు జామున టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, ఆయన అరెస్ట్ విషయంలో గానీ, ఎక్కడికి తీసుకెళ్లారనే విషయంలో గానీ క్లారీటి లేదట.
ఇదిలా ఉండగా గతంలో వైసీపీ నేతలు సంగం డెయిరీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా ఏపీ రాజధాని భూముల వ్యవహారంలో కూడా ధూళిపాళ్ల పాత్ర ఉందనే ప్రచారం కూడా ఉంది.
ఈ క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.ఇకపోతే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్పై టీడీపీ నేతలు ఆందోళన చేస్తూ, ముందస్తు సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
కాగా, నరేంద్ర అరెస్ట్తో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.