కరోనా కరోనా నువ్వు ఎప్పుడు పోతావ్ అంటే కోటి ప్రాణాలు తీసుకోందే నేను ఈ భూలోకం నుండి వెళ్లను అని చెప్పిందట అని అంటున్నారు.బహుశా జోక్ చేసారేమో గానీ ఈ వార్త నిజం ఆయ్యేలా కనిపిస్తుంది.
ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ భారతీయులకు ఒక్క అవకాశాన్ని ఇచ్చింది.
ఈ ఆప్షన్ సరిగ్గా ఉపయోగించుకో లేదని కోపంతో సెకండ్ వేవ్గా ప్రవేశించి ఒక్కొక్కర్ని చెడుగుడు ఆడేస్తుంది.
దొరికిన వారిని దొరికినట్లుగా అంటే సామాన్య ప్రజలతో పాటుగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అనే తేడా లేకుండా బలి తీసుకుంటుంది.తన టార్గెట్ రీచ్ అయ్యే దిశగా పరుగులు పెడుతుంది.
ఇకపోతే తాజాగా కరోనా వైరస్ అకౌంట్లో మరో ఏపీ టీడీపీ సీనియర్ నేత చేరాడు.తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ బొడ్డు భాస్కర రామారావు (72) ఆదివారం ఉదయం కరోనాతో కన్నుమూసినట్లు సమాచారం.
ఇతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చేరి చికిత్స తీసుకుంటున్నాడట.ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్స్ హెచ్చు తగ్గులు జరగడంతో పరిస్థతి విషమించి ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడినట్లుగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయట.