ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో టిడిపి శ్రేణులలో సంతోషం నెలకొంది.కాగా జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు భారీ ఉద్వేగానికి గురయ్యారు.
అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకోవడం జరిగింది.చేయని తప్పుకు సంబంధంలేని విషయంలో నన్ను అరెస్టు చేశారు.
జైల్లో పెట్టారు అంటూ అచ్చెన్నాయుడు ఆవేదన చెందాడు.అరెస్ట్ అయినందుకు బాగా లేదని కానీ ఎప్పటినుంచో తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఏకగ్రీవమే కొనసాగుతుంది అని చెప్పిన ఆయన తనపై ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు.
అందువల్ల ఈసారి ఏకగ్రీవాలు కోరుకోలేదని పేర్కొన్నారు.అంతేకాకుండా అప్పన్న సోదరులు కోరినందు వలనే… అప్పన్న అనే వ్యక్తి కి తాను ఫోన్ చేసినట్లు.తన ఫోన్ కాల్ రికార్డ్ అవుతుందని ఊహించలేదు, పైగా నేను మాట్లాడిన దానిలో ఎక్కడైనా బెదిరింపు ధోరని కనబడిందా అంటూ సంచలన సవాల్ విసిరారు.మాట్లాడిన తీరు గమనిస్తే అందులో బెదిరింపులకు పాల్పడినట్టు ఒక్క చిన్న పదమైన ఉందా.? ఉందని నిరూపిస్తే ఇప్పటికిప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.ఇదే క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా పోరాటానికి రెడీ అవ్వాలని పిలుపునిచ్చారు.