రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గానికి రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉంది.ఆ మాటకు వస్తే సమైక్యాంధ్రలో కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు.
ఎన్టీఆర్ రాకతో వీరి హవాకు కాస్త బ్రేక్ పడినా…కాంగ్రెస్ అధికారంలో ఉంటే మళ్లీ ఈ సామాజికవర్గం వారే ముఖ్యమంత్రులుగా పాలన చేపట్టారు.
అంత ఘనమైన హిస్టరీ ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఏపీలో ఓ జిల్లాకు చెందిన మంత్రి దారుణంగా తొక్కేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తన జిల్లాల్లో ఓ రేంజ్లో చక్రం తిప్పుతున్నారు.నిజానికి నారాయణ డైరెక్టు ఎన్నికల్లో నిలబడితే ఎంత వరకు గెలుస్తారనేది ప్రశ్నార్థకమే.? గత ఎన్నికల్లో టీడీపీ గెలిచాక అదిరిపోయే లక్కుతో మంత్రి పదవి కొట్టేసిన నారాయణ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు.
నారాయణ కీలకమైన రాజధాని అమరావతి నిర్మాణంలో చక్రం తిప్పుతూ చంద్రబాబు చంద్రబాబు వద్ద మంచి మార్కులు వేయించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సొంత జిల్లాలో పట్టుకోసం నారాయణ వేస్తోన్న ఎత్తులు చాలామందికి రుచించడం లేదు.ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టు రెడ్డి వర్గం నేతలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లా టీడీపీలో రెడ్డి వర్గం నేతల సంఖ్య చాలా ఎక్కువే.ఆదాల, ఆనం బ్రదర్స్, సోమిరెడ్డి ఇలా చాలా ప్రముఖులు ఉన్నారు.నారాయణ మాత్రం వీళ్లందరిని పక్కన పెట్టేసి తన సొంత సామాజికవర్గమైన బలిజలకే ప్రయారిటీ ఇస్తున్నారని వీరు తీవ్రంగా రగిలిపోతున్నారట.జిల్లాలో నారాయణ సామాజికవర్గ ప్రాబల్యం ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే ఉంటుందని, రెడ్లను విస్మరిస్తే 2019 ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని భావిస్తోన్న రెడ్డి వర్గం నేతలు.
ఈ విషయాన్ని చినబాబు లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట.
ఇటీవల నెల్లూరు కమిషనర్ బదిలీ వ్యవహారం నుంచి ప్రతి చిన్న విషయంలోనే అందరూ తనపైనే ఆధారపడాలనే నిర్ణయానికి ఆయన వచ్చేశారట.
జిల్లా పార్టీ అధ్యక్షడు బీద రవిచంద్ర కూడా మంత్రికే సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు.ఫలితంగా రెడ్డి సామాజిక వర్గం తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదట.
ఈ విషయంలో లోకేష్ జోక్యం చేసుకోకపోతే నారాయణ నెల్లూరు టీడీపీ పుట్టి ముంచడం ఖాయమన్న గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.