ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు .వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని చెబుతున్నారో మాట తప్పారు అని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో జగనన్న కాలనీల ఇళ్ల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలతో ఇల్లు పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుంది అంటూ ప్రశ్నించారు.పేదల అంటే ప్రభుత్వానికి చులకన భావం ఏర్పడిందని.జగన్ చెప్పే పనులకు ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడ సంబంధం లేదని విమర్శలు చేశారు.తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసుకున్న డబుల్ బెడ్ రూమ్ బ్యాలెన్సింగ్ పనులను జగన్ ప్రభుత్వం ఆపేయటం జరిగిందని బుద్ధా వెంకన్న విమర్శించారు.
కొద్దిపాటి బ్యాలెన్స్ ఉన్న పనులు పూర్తి చేస్తే పేదలకు ఇళ్లు వచ్చే అవకాశం ఉందని .స్థానిక మిషన్లను దోచుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తుందని తెలిపారు.ఇదే క్రమంలో ప్రస్తుతం స్టార్ట్ చేసిన జగనన్న కాలనీల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి అని, ఎందుకంటే ప్రభుత్వంపై వారికి నమ్మకం లేదు అని బుద్ధా వెంకన్న ఆరోపించారు.
ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు అంటే జగన్ స్టార్ట్ చేస్తున్న పనులు కేవలం పబ్లిసిటీ చేసుకోవటానికి తప్ప దేనికీ పనికి రాదని విమర్శించారు.ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీరియస్ అయ్యారు.
ప్రస్తుతం జగనన్న కాలనీల ఇల్లు కార్యక్రమం కేవలం వైసీపీ మంత్రులు జేబులు నింపుకోవడానికి అంటూ విమర్శలు చేశారు.
.