నిత్యం వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే ఓ మాజీ మంత్రికి పంచాయతీ ఫలితాలు పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి.ఆయన సొంత నియోజక వర్గంలోనే పరువును పోగొట్టాయి.
ఇదంతా అధికారపక్ష ఆర్థిక విజయం అని సర్ది చెప్పుకొంటున్నా నాలుగు గోడల మధ్య వ్యథ మరోలా ఉందట.ఆయన పేరే దేవినేని ఉమా.
కాగా మైలవరంలో 48 పంచాయతీలలో 44 చోట్ల వైసీపీ విజయం సాదించడం.అది టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం కావడం టీడీపీ వర్గీయులకు మింగుడు పడడం లేదట.
ఇకపోతే మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో భాగంగా మైలవరం నియోజవకర్గంలోని 48 పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగగా, కేవలం మూడుచోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు.మరో పంచాయతీని ఇతరులు దక్కించుకున్నారు.
దీంతో దేవినేని సొంత నియోజకవర్గం ఫలితాలపై ఇంటా బయటా చర్చ మొదలైంది.అంతే కాకుండా సొంత నియోజకవర్గంలోనే పట్టుమని 10 పంచాయతీలు గెలిపించుకోలేని నాయకుడు, అధికారంలో ఉన్న ప్రభుత్వం పై సెటైర్లు వేస్తుండటం హస్యస్పదం అంటున్నారట వైసీపీ నేతలు.ఏది ఏమైనా ఈ పంచాయతీ ఫలితాలు దేవినేనిని డిఫెన్స్లో పడేశాయనే కామెంట్స్ ఊపందుకుంటున్నాయట.