ఉదయం ఏపీ నూతన ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వాహణకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ తో మంతనాలు జరిపి పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అనేక విషయాలు ఎస్ఈసీ కార్యాలయంలో చర్చించారు.
ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ప్రధానంగా కార్యదర్శి మరియు బిజెపి పాల్గొని ఎన్నికల నిర్వహణ మరియు భద్రత ఏర్పాట్లు ఇంకా అనేక అంశాలపై చర్చించి పరిషత్ ఎన్నికల తేదీని ఎస్ఈసీ నీలం సాహ్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పరిషత్ ఎన్నికలకు సంబంధించి గత ఏడాది మార్చి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది.ఈ క్రమంలో నామినేషన్ స్వీకారం మరియు ఉపసంహరణ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి.ఈలోగా మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో పరిస్థితులు మొత్తం మారిపోవడంతో పరిషత్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో అప్పటి నుండి పెండింగ్లో ఉన్న పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విషయానికి సంబంధించి ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు తో మరియు సిబ్బంది తో చర్చించి తాజాగా నీలం సాహ్ని పూర్తి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు.ఈ విషయాన్ని ఇప్పటికే గవర్నర్ దృష్టికి ఎస్ఈసీ పరంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతా రెడీగా ఉన్నట్లు నీలం సాహ్ని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.దీంతో ఈ రోజు సాయంత్రం లోపు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.