ఏపీ రాజకీయాలు పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది.ఒకప్పుడు కంటే ఇప్పుడు మరింత దిగజారిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు రాజకీయ నేతలు.
మాటలు హద్దులు దాటడంతో ఎంతలా రగడ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం.అయితే ఇక్కడే ఓ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది.
అదేంటంటే ఇక్కడి పంచాయితీలు కాస్తా ఢిల్లీకి వెళ్తున్నాయి.ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయనే చెప్పాలి.
మొన్నటికి మొన్న రఘురామ విషయంలో సీఎం జగన్ ఏకంగా ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ఏపీలో దాడుల నేపథ్యంలో చంద్రబాబు మరోసారి ఢిల్లీ బాట పట్టారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.ఇందుకోసం బీజేపీ కేంద్ర పెద్దలను కలుస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ పట్టుబడుతున్నారు.
ఇక్కడే ఆయన వితంత వాదన చేస్తున్నారనే విమర్శలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.ఎందుకంటే గవర్నర్ కోరకుండా ఇలాంటివి జరగవన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక మరో ప్రయోగంగా ఆయన ఢిల్లీలో జాతీయ మీడియాతో కూడా మాట్లాడుతారనే ప్రచారం జరుగుతోంది.
అంటే జగన్ ప్రభుత్వ హయాంలోనే ఇలా దాడులు పెరుగుతున్నాయని ఆయన నిప్పలు చెరిగే ప్రమాదం కూడా ఉంది.ఇందులో మరో అంశం ఏంటంటే జగన్తో బీజేపీకి ఉన్న సంబందాన్ని విడగొట్టాలనేది చంద్రబాబు ప్లాన్గా కనిపిస్తోంది.అయితే చంద్రబాబుకు కౌంటర్ వేసేందుకు జగన్ కూడా ఢిల్లీ బాట పట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన ఎంపీలను అలెర్ట్ చేసి పెట్టారని, 28న ఓ సారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత ఢిల్లీ టూర్ వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని వారి మనోగతాన్ని తెలుసుకుంటారని తెలుస్తోంది.
ఏదేమైనా ఇరువురు ఇలా ఢిల్లీ బాట పట్టడంతో ఢిల్లీ బాట పట్టాయి ఏపీ రాజకీయాలు.