ఎంత మొత్తుకున్నా ఏమి ప్రయోజనం ?

ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా గురించి ఇంకా గొంతు చించుకుంటూనే ఉన్నాయి నాయకులు విలేకరుల సమావేశాలు పెట్టి కేంద్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకు పడుతూనే ఉన్నారు.ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఘాటుగా విమర్శించారు.

 Ap People Deceived Over Special Status Issue-TeluguStop.com

ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని అన్నారు.రఘువీరా ఆవేదన కరెక్టే.

కానీ మొన్న ఈ మధ్య కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా శకం ముగిసిపోయిందని చెప్పారు.అంటే ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వం అని చెప్పినట్లే కదా.ఇది ఎపీకి కూడా వర్తిస్తుంది.ఇంత స్పష్టంగా చెప్పాక ఇంకా గొంతు పోయేలా అరవడం ఎందుకు? చంద్ర బాబు ఎప్పుడో నోరు కట్టేసుకున్నారు.కేంద్రం దయతలచి ప్యాకేజీ ఇస్తే సంతోషం.అది కూడా ఇవ్వకపోయినా చేసేది ఏమీ లేదు.ఎన్నికల్లో చూసుకోవడమే.హోదా అడిగితే పాపాత్ముల్లా చూస్తున్నారు ఏపీ బీజేపీ నాయకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube