జీవో నంబర్.1పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు తెలిపారు.ఈ మేరకు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించామన్నారు.జీవో నెంబర్ .1ను హైకోర్టు కొట్టేస్తుందని భావిస్తున్నామని చెప్పారు.ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని తెలిపారు.
కానీ వైసీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.విపక్షాలను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం జీవో నెంబర్.1ను తీసుకువచ్చిందని ఆరోపించారు.