దేశ రాజకీయాలలో మోడీ నియంతృత్వ పాలన సాగుతూ వుంటే దానికి వత్తాసు పలికే విధంగా ఏపీలో చంద్రబాబు సర్కార్ ప్రవర్తిస్తూ వుందని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శలు చేసారు.కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో ప్రతి జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తుంది.
అయితే నిన్న వైజాగ్ లో జరగాల్సిన యాత్రకి ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై రఘువీరారెడ్డి మీడియా సమావేశంలో సీరియస్ అయ్యారు.ప్రధాని పర్యటనని తాము అడ్డుకోవడానికి బస్సు యాత్ర చేయడం లేదని, కేవలం ప్రజలకి భరోసా ఇవ్వడానికి చేస్తున్నామని రఘువీరా అన్నారు.
అయితే ప్రతిపక్షం ని ప్రధాని సభ కోసం అడ్డుకోవడం చూస్తుంటే అతనికి భయం పట్టుకుందని విమర్శలు చేసారు.అయితే ఏపీ ప్రభుత్వం కూడా దానికి ఎందుకు వత్తాసు పలికారో చెప్పాలని రఘువీరా డిమాండ్ చేసారు.
మరో వైపు ప్రధాని వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే డివిజన్ కి కేవలం పేరు మాత్రమె మార్చారని రఘువీరా విమర్శించారు.నిన్నటి మోడీ పర్యటనకి నిరసన తెలియజేసిన అందరికి తన పార్టీ నుంచి అభినందన తెలియజేస్తున్నామని అన్నారు.
.