ఏపీ ఎన్జీవో సంఘ కొత్త అధ్యక్షుడిగా… చంద్రశేఖరరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఇప్పటి వరకు ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు రిటైర్ అవుతున్న నేపధ్యంలో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు.
చంద్రశేఖరరెడ్డి ఇంతవరకు సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
కాగా కొత్త ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా … చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయని,అందువల్ల ,ఈలోగానే ఉద్యోగుల డిమాండ్ లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.