సునామి వచ్చే ముందు ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని అంటారు ప్రస్తుతం కరోనా విషయంలో ఈ మాట నిజమనిపిస్తుంది.కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చాక ఒక్క సారిగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ఆ తర్వాత సెకండ్ వేవ్ అంటూ కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మాత్రం గత నెల నుండి ఆపకుండా పరుగుల వేట దేశంలో కొనసాగిస్తుంది.
ఈ క్రమంలో పుట్టగొడుగుల్లా కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి.
ఊహించని ఈ కోవిడ్ ఉదృతి వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడిందని, ప్రైవేటు ఆసుపత్రులు బిల్లుల మోత మోగిస్తున్నాయనే వార్తలు ప్రచారం జరుగుతుండగా ఈ విషయంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
కరోనా పేషంట్ల నుండి అధిక ధరలు వసూలు చేసే ఆసుపత్రులను సీజ్ చేయడమే కాకుండా, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి తప్పిస్తామని హెచ్చరించారు.
కాగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న చార్జీలపై ప్రత్యేక జీవో తీసుకువచ్చామని, పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.