ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ నీటి గౌరవాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదేరీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు.
మరోపక్క ప్రతిపక్షాలు ఇలాంటి పొలిటికల్ డ్రామాన్ని కావాలని కేసీఆర్జగన్ ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అన్నారు.
రాయలసీమ ప్రాంతానికి మేలు చేసే రీతిలో నీరు అందించాలని ఆకాంక్షతో ఉన్నట్టు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా కలిసి ఉన్నారని తెలిపారు.అంతమాత్రమే కాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్ కి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అంటే గౌరవమని స్పష్టం చేశారు.
అదే రీతిలో కెసిఆర్ కి కూడా జగన్ అంటే గౌరవం అని తెలిపారు.జల వివాదం విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు కేసిఆర్ వైయస్ జగన్ ల మధ్య గొడవలు సృష్టించే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎటువంటి సమస్య అయినా ముఖ్యమంత్రులు కూర్చుని పరిష్కరించుకునే రీతిలో వాతావరణం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు.
.