‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ సమాచార, ప్రసారశాఖ మంత్రి పేర్ని నాని నివాళులర్పించారు.అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్తో పాటు, ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.వారిని ఓదార్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘తెలుగు అక్షరాలు 56.తెలుగు నేర్చిన ప్రతి వాడికీ అవే మూలం.
అలాంటి అక్షరాలతో పద విన్యాసం చేసి, ప్రతి తెలుగువాడి మదిలో చెరగని ముద్రవేసిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి.
తెలుగుజాతి గర్వపడేలా తన కలాన్ని కదిలించిన గీత రచయిత, సాహితీకారుడు.
ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి తరపున ఘన నివాళి అర్పిస్తున్నాం.
‘సిరివెన్నెల’ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ మంత్రి పేర్ని నాని
.