ఏపీలో వైసీపీ వర్సెస్ చంద్రబాబు మధ్య పోరు ఎప్పుడు ఉత్కంఠంగా సాగడం చూస్తూనే ఉన్నాం.టీడీపీ అంటే చక్రాలు లేని సైకిల్ గా మారింది వైసీపీ నేతల దృష్టిలో.
పేరుకే ప్రతిపక్షం గానీ ఎప్పుడు ఒక నిజమైన ప్రతిపక్ష నేతలా బాబు మసలుకోవడం లేదని, వైసీపీ నేతలపై కక్షకట్టినట్లుగా ప్రవర్తిస్తున్నాడని ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇలా ఒకరి మీద ఒకరు నిందలు, విమర్శలు చేసుకుంటూ రాజకీయ జీవితాన్ని నెట్టుకొస్తున్నారని అనుకుంటున్నారట ప్రజలు.
ఇదిలా ఉండగా తాజాగా కరోనా విషయంలో బాబు చేసిన వ్యాఖ్యల పై ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.ప్రాణ భయంతో పక్క రాష్ట్రంలో దాక్కుని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్న చంద్రబాబుది 13 ఏళ్ల దిక్కు మాలిన అనుభవమని మండిపడ్డారు.
తన కొడుకు భవిష్యత్తు కోసం విపత్తు సమయంలో రాజకీయం చేస్తున్న చంద్రబాబు కరోనా కంటే ప్రమాదకరం అని ఎద్దేవా చేశారు.ఈ మాటలన్ని పక్కన పెడితే ప్రస్తుతం ప్రజలు ఉన్న పరిస్దితి ఏంటి రాజకీయ నేతల మాటలు ఏంటీ ఏమన్నా సింక్లో ఉన్నాయా అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారట.