ఔను! మీరు చదివింది నిజమే! ఏపీలోని చంద్రబాబు సర్కారులో కీలక శాఖలో ఉన్న ఓ మంత్రి తన వ్యాపారానికి చెందిన రూ.300 కోట్లను వైట్ చేసుకున్నారట! అది కూడా నోట్ల రద్దు నిర్ణయానికి ఖచ్చితంగా నెల ముందే! అంటే ఆయనకు ముందుగానే మోడీ నిర్ణయం తెలిసిపోయిందా? పెద్ద నోట్ల రద్దు విషయం తెలియడం వల్లే.తనదగ్గ రున్న మూడు వందల కోట్లను వైట్ చేసేసుకున్నారా? ఇప్పుడు ఇదే టాపిక్ పెద్ద ఎత్తున ఏపీలో సాగుతోంది.ఏ ఇద్దరు కలిసినా.
ఈ మంత్రిగారి గురించే చెప్పుకొంటున్నారు.మరి ఆ విషయం ఏంటో చూద్దాం.
టీడీపీ దాదాపు పదేళ్లపాటు విపక్షంలో ఉంది.దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
ఆర్థికంగా కూడా ఆయన పెద్దగా బలంగా నిలవలేకపోయారు.అందుకే 2009 ఎన్నికల్లో ఆయన పూర్తిస్థాయిలో దెబ్బతిన్నారనే టాక్ ఉంది.
అయితే, ఈ క్రమంలోనే ఆయనకు పరిచయమైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త బాబుకు అండగా నిలిచారు.విపక్షంలో ఉన్న సమయంలోనేకాకుండా 2014 ఎన్నికల సమయంలోనూ బాబుకు అన్ని విధాలా ఆదుకున్నారట.
ప్రచారానికి అయితే నేం.పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అయితేనేం ఆయన ఆర్థికంగా బాగా ఉపయోగపడ్డారట.
దీంతో చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి ఏపీ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా గౌరవించారు.ఇక, ఇప్పుడు మంత్రిగా ఆయన రెండున్నరేళ్లు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన వ్యాపారాల్లోకి పెట్టుబడులు వరదలై ప్రవహించాయట.దీంతో పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించారు.
అయితే, ఎందుకో ఏమో తెలీదుకానీ, గత నెల తొలివారం లేదా అంతకు ముందు నెల మూడో వారంలోనే సడెన్గా ఆయన తన డిపాజిట్ దారులను సమావేశ పరిచి.మీ డిపాజిట్లు మీరు తీసుకోండి అని లెక్కలు అప్పగించేశారట.దీంతో రూ.300 కోట్ల రూపాయల ధనాన్ని వారి ఖాతాలకు మంత్రి గారు పంచేశారు.ఈ సందర్భంగా వారికి మంచి లాభాలే ఇచ్చారని టాక్.దీంతో వారంతా తెగ సంబర పడ్డారట.తక్కువ సమయంలో ఎక్కువ వచ్చిందని అనుకున్నారట.
ఇది జరిగిన నెల తర్వాత ప్రధాని మోడీ బ్లాక్ బస్టర్ ప్రకటన చేసేసరికి డిపాజిట్ దారులు అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారట!! ఇప్పుడు అర్ధమైందట ఆ మంత్రి గారు తమ డిపాజిట్లను ఎందుకు వెనక్కి ఇచ్చారో! దీంతో ఇప్పుడు వారంతా తమ వద్ద ఉన్న డబ్బు కట్టలను మార్చుకోలేక, లెక్కలు చెప్పి సగానికి సగం ట్యాక్స్ కట్టలేక పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకుని అయ్యా డబ్బు మార్చి పెట్టండి అని బతిమాలుకుంటున్నారట.
అయినా.ఎవరూ పట్టించుకోవడం లేదట.
దీంతో తమకే పెద్ద షాక్ ఇచ్చిన ఆ మంత్రినే పట్టుకుని ఎలాగైనా బ్లాక్ని వైట్ చేసుకోవాలని చూస్తున్నారట.మరి ఏంజరుగుతుందో చూడాలి.
మొత్తానికి మంత్రి మాత్రం సేఫ్గా తప్పించుకున్నారు.