చంద్రబాబు పై ఏపీ మంత్రి ఫైర్.. ??

రాజకీయ నాయకుల దృష్టికి ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించే బదులు రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూడటం వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం అందరికి తెలిసిందే.ఈ దశలో ఏపీలో హిందు ఆలయాలపై జరిగిన దాడులు అక్కడి నాయకులకు బెల్లం ముక్కలా మారాయట.

 Ysrcp, Anil Kumar Yadav, Fires, Chandrababu, Attacks On Temples-TeluguStop.com

అసలు ఇలాంటి సంఘటనలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారనే సమాచారం సేకరించి ఆ దుండగులను శిక్షించే బదులు ఇలాంటి దుందుడుకు చర్యలు మీరు చేశారంటే మీరు చేశారని ఒకరి మీద ఒకరు రాళ్లూ వేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూన్నారంటున్నారట ప్రజలు.

మతం ఏదైనా ఇలాంటి నికృష్టపు పనులు చేసిన వారిని దొరకబట్టే బదులుగా మీరు దొంగలు మీకే ఇలాంటి పనులు చేతన అవుతాయనే మాటలు ఆపితే మంచిదనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో మొదలైందని సమాచారం.

ఇకపోతే దేవాలయాల పై దాడుల విషయంలో ఏపీ మంత్రి అనిల్ కుమార్ టీడీపి నేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడం కేవలం టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే తెలుసని, విగ్రహాల ధ్వంసం కేసుల్లో వాస్తవాలు బయటపడుతుంటే నారావారి నరాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు అనిల్.

రాముడి విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న కుట్ర గురించి చంద్రబాబుకు ముందే తెలుసని ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు.

భూమా అఖిలప్రియ కేసుల గురించి మాట్లాడని చంద్రబాబు మిగతా అన్ని కేసుల గురించి మాట్లాడటం విడ్డూరం అంటూ ఫైర్ అయ్యారు అనిల్ కూమార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube