దేశంలోని సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ వింజృంభిస్తుండటంతో మిగతా రాష్ట్రల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైందట.
మరోసారి కోవిడ్ 19 వ్యాపిస్తే తట్టుకుని నిలబడే పరిస్దితులు దేశంలో లేవు.
అటూ ప్రభుత్వాలు కూడా విఫలం అవడం ఖాయం అనే గుసగుసలు వినిపిస్తున్నాయట.ఇదిలా ఉండగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ విడుదల చేసింది.
వారు వెల్లడించిన వివరాల ప్రకారం.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయట.
ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,257 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వాటిలో కొత్త పాజిటివ్ కేసులు 41 వరకు నమోదు అయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడిస్తుంది.
ఇకపోతే గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని, కరోనా నుండి 71 మంది రికవరీ అయ్యారని తెలియచేసింది.ఇక ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 886444 కి చేరగా, కోలుకున్న వారి సంఖ్య 878687 కి చేరుకుందట.కాగా కరోనాతో ప్రస్తుత సమాచారం వరకు 7167 మంది మృతి చెందగా, రాష్ట్రంలో 590 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఈ బులెటిన్లో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.