రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, చాలా మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కారణం ప్రభుత్వం అంటూ చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.
భవన నిర్మాణ కార్మికులకు అండగా అంటూ రేపు వైజాగ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ లాంగ్ మార్చ్కు సిద్దం అయ్యారు.
లాంగ్ మార్చ్పై ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేయబోతున్నది లాంగ్ మార్చ్ కాదని అది ఒక రాంగ్ మార్చ్ అని అన్నాడు.
చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తే దాన్ని కొనసాగింపుగా జనసేన పార్టీ ఆ ఆందోళనలు కంటిన్యూ చేస్తుంది అంటూ ఎద్దేవ చేశాడు.పవన్ కళ్యాణ్ ఏర్పేడు ఘటన బాధితులను ఎందుకు పరామర్శించలేదు అంటూ అనీల్ ప్రశ్నించాడు.
ఒకరి అజెండాను మరొకరు మోస్తూ చేస్తున్న ఈ రాజకీయం ఎప్పటి వరకు కొనసాగదు అంటూ అనీల్ కుమార్ ఎద్దేవ చేశారు.