ఏపీ హోంమంత్రి సుచరిత టీడీపీ అధినేత చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.కావాలనే టీడీపీ నాయకులతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని సుచరిత ఆరోపించారు.డీజీపీకి…ఫోన్ చేస్తే స్పందించలేదని… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అని పేర్కొన్నారు.కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ల పార్టీ కార్యకర్తలతో నే వాళ్ళ కార్యాలయాలపై.
దాడులు చేయించుకున్నారు అనే అనుమానం వ్యక్తం అవుతుందని స్పష్టం చేశారు. టిడిపి నాయకులు కావాలనుకుంటే మీ అధినేత చంద్రబాబుని పొగడండి.
అందులో తప్పు లేదు.
విధానపరంగా లోపాలు ఏమైనా ఉంటే ప్రశ్నించండి.
సూచనలు ఇవ్వండి.అంతేగాని ఈ విధంగా దుర్భాషలాడి సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ చేస్తున్నారు ఒకసారి పునర్ ఆలోచించండి అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలు ఎన్నుకున్న.మెచుకున్న ముఖ్యమంత్రిపై.
చేతగాని వాడు పాలెగాడు.అంటూ విమర్శలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
మొత్తం పరిణామాలు చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి చంద్రబాబే.దగ్గరుండి ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నట్లు తమకు అనుమానం కలుగుతుందని.
సుచరిత సంచలన వ్యాఖ్యలు చేశారు.