న్యాయవాద వృత్తి ఎంత పవిత్రం అయినదో అందరికి తెలిసిందే.అన్యాయం అవుతున్న న్యాయాన్ని బ్రతికించడానికి నల్లకోటు ధర్మ దేవతగా మారి కోర్టులో లాయర్ ఒంటిని చేరింది కావచ్చూ.
అందుకే ఆ కోటుకు అంత విలువ అంటారు.అలాంటి వృత్తిని చేతపట్టిన వారు ఇంకెంత పవిత్రంగా ఉండాలో ఊహించుకోండి.
కానీ నేడు నల్లకోటు బజార్లో అవినీతికి అమ్ముడై పోతుంది.న్యాయాన్ని బ్రతికించవలసిన లాయర్లు అన్యాయానికి కొమ్ము కాస్తున్నారు.అందువల్ల లోకంలో న్యాయం ఆచూకి కనుమరుగైయ్యింది.ఇకపోతే తప్పులు ఎత్తిచూపే లాయర్లు రౌడీల కంటే దారుణంగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది.ఆ వివరాలు చూస్తే.
ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కుర్చీలు విరిగే విధంగా న్యాయవాదులు కొట్టుకున్నారట.
బార్ కౌన్సిల్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమైన న్యాయవాదుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో అది కాస్త ఉద్రిక్తతలకు దారి తీసిందని సమాచారం.ఇకపోతే ఈ ఘర్షణలో కొందరికి గాయాలు కూడా అయ్యాయట.