రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి భారీగా ఉన్న సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి పది వేలకు దగ్గరలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చికిత్స వివరాలు తెలపాలని హైకోర్టు తెలిపిన క్రమంలో ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై న్యాయస్థానం సీరియస్ అయింది.కరోనా కేసులు అదేవిధంగా కారణం నిర్ధారణ పరీక్షల విధానం మరియు చికిత్సపై వివరాలు అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్రంలో ఆసుపత్రిలో బెడ్స్ మరియు ఆక్సిజన్, మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయస్థానంలో కరోనా ట్రీట్మెంట్ కి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో .హైకోర్టు సీరియస్ అయింది.రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తోట సురేష్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది.
ఈ క్రమంలో ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో ఇప్పటివరకు ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కడిగిపారేసింది.
.