ఏపీలో ఫ్లెక్సీల నిషేధంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది.
ఓపెన్, సీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేధం వర్తించదని న్యాయస్థానం స్పష్టం చేసింది.అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు హైకోర్టు వాయిదా వేసింది.
అయితే రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమలు చేయాలనుకుంది.
అనంతరం జనవరి 26కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.