ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో అబద్ధపు లెక్కలు ప్రభుత్వం చూపుతోంది అంటూ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఇటీవల విమర్శలు చేయడం జరిగింది.దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు.
చంద్రబాబు నాయుడు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.అందువల్లే చంద్రబాబుని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రజల ప్రాణాలతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు ని ఘోరంగా ఓడించడంతో.ప్రజలపై కక్ష గట్టి ఆయన ఈ విధంగా స్పందిస్తున్నారు ఏమో అన్న అనుమానాలు కలుగుతున్నాయని కౌంటర్లు వేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రీతులుగా పనిచేస్తుందని 104 కాల్ సెంటర్లు ఏర్పాటు చేయడం మాత్రమే కాక ఆక్సిజన్ మరియు బెడ్లు కొరత లేకుండా .రాష్ట్రంలో కోవిడ్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాలన అని తెలిపారు.రాష్ట్రానికి కేంద్రం 420 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు.వైద్య పరంగా అన్ని రీతులలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటే చంద్రబాబు.
భయపెట్టే రీతిలో మాట్లాడటం దారుణమని ఆళ్ల నాని విమర్శించారు.
.