ఆరోపణలు చాలా వస్తాయి.వెనక్కి చూసుకుంటే నిజాలు తెలుస్తాయి.
హెరాయిన్ గుజరాత్ లో దొరికినప్పటి నుంచీ ఆరోపణలు చేస్తున్నారు.ఏపీకి ఎలాంటి సంబంధం లేదు.
డీఆర్ఐ ఆ కేసును విచారణ చేస్తోంది.దాదాపు 3000 కేజీలు హెరాయిన్ దొరికింది.
విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీ గా నేను చెప్పాం,ఆరోపణలు సరైనవి కావు అని చెప్పాను.సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఏపీకి సంబంధం లెదని చెప్పారు.
ఎన్ఐఏ కూడా ఏపీ కి సంబంధం లేదని చెప్పారు.నిన్న జరిగిన సంఘటనలు దారుణం నిన్న పట్టాభి వ్యాఖ్యలు ఇబ్బందికరమైన, రాజ్యాంగ విరుద్ధమైన భాషలో ఉన్నాయి.
పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు.నెల నుంచీ వచ్చిన మాటల వలన నిన్న దారుణమైన సంఘటనలు జరిగాయి.ఒక పార్టీ కార్యాలయం నుంచీ అలాంటి దుర్భాషలు చేయడం ఒప్పుకోలేనిది పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదు.ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యన్తరం కర వ్యాఖ్యలు చెయ్యకూడదు.
ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం.పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదు.
పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదు….ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారు.
పరేడ్ లో బ్యాండ్ జరుగుతున్న సమయం లో నాకు నిన్న వాట్స్ అప్ కాల్ వచ్చింది.
ఎస్పీ, పోలీసు స్టేషను కూడా స్పందించారు కేసు పరిశోధనలో ఉంది.దశాబ్దాల సమస్య గంజాయి సమస్య గత సంవత్సర కాలం నుంచి ఎస్ఈబీ ద్వారా గంజాయిని చాలా అరికట్టాం గత పది సంవత్సరాల కంటే తక్కువ స్ధాయికి కేసుల సంఖ్య వచ్చింది.4వేల మందికి పైగా గంజాయి కేసులో అరెస్టు చేసాం.తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి జాయింట్ రెయిడ్ లు గంజాయి విషయంలో చేసాం
.